ETV Bharat / state

పీసీసీ చీఫ్​గా ఉత్తమ్​నే కొనసాగించాలి: జగ్గారెడ్డి

author img

By

Published : Mar 3, 2020, 8:13 PM IST

వచ్చే ఎన్నికల వరకు పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డినే కొనసాగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎవరి పేరు చెప్తే వారే పీసీసీ చీఫ్​ అవుతారనే ప్రచారం అవాస్తమని తెలిపారు.

Jagga reddy
Jagga reddy

పైరవీ చేసే వాళ్లకు పీసీసీ పదవి ఇస్తే పార్టీ దెబ్బ తింటుందని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి లాయల్‌గా ఉండే వారికే పదవి ఇవ్వాలన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎవరి పేరు చెప్తే వారే పీసీసీ చీఫ్​ అవుతారనే ప్రచారం అవాస్తమని తెలిపారు. పీసీసీ రేసులో జానారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ లాంటి వాళ్లూ ఉన్నారన్నారు.

రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు.

'పీసీసీ చీఫ్​గా ఉత్తమ్​నే కొనసాగించాలి'

ఇదీ చూడండి: 'మోదీజీ.. ఖాతాలు కాదు ద్వేషాన్ని వదులుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.