ETV Bharat / state

ఉగాది రోజున తిరుమల శ్రీవారి సాధారణ సేవలు రద్దు

author img

By

Published : Apr 11, 2021, 7:47 PM IST

ఉగాది పండుగను పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 13న స్వామి వారి సాధారణ సేవలు రద్దు చేశారు. ఈ మేరకు తితిదే ప్రకటన చేసింది.

tirumala news
తితిదే కీలక నిర్ణయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది. ఆ రోజున తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి.. అనంతరం శుద్ది చేయనున్నారు. ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేయనున్నారు. ఆ తరువాత 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి వేంచేయనున్నారు.

అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేసి పంచాగ శ్రవణం చేయనున్నారు. ఉగాది ఆస్థానం కారణంగా ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ‌ఆర్జిత సేవలు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఇతర కార్యక్రమాలను తితిదే రద్దు చేసింది.

ఇవీచూడండి: షీ టీమ్​కు ఆరేళ్లు.. మహిళా రక్షణలో ఆశించిన స్థాయికి చేరిందా.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.