ETV Bharat / state

శాస్త్రోక్తంగా రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలు

author img

By

Published : Aug 5, 2020, 12:04 PM IST

ttd-gives-pattu-vastralu-to-mantryalam-temple-in-kurnool-district
రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలు

ఏపీలోని రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలకు తితిదే వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను మూల బృందావనం వద్ద ఉంచి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు పూజలు నిర్వహించారు.

ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి.. 349వ ఆరాధనోత్సవాల సందర్భంగా మధ్యారాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ ఆరాధనోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను అందుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు.. మూల బృందావనం వద్ద ఉంచి పూజలు చేశారు.

ఇదీ చదవండి: అమ్మవారి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠను అడ్డుకున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.