ETV Bharat / state

గ్రూప్​1 ప్రిలిమ్స్​ ఫలితాలు వెల్లడించిన టీఎస్​పీఎస్సీ.. ఒక్కో పోస్టుకు ఎంతమందో తెలుసా?

author img

By

Published : Jan 14, 2023, 6:41 AM IST

Updated : Jan 14, 2023, 6:52 AM IST

TSPSC released Group 1
గ్రూప్​1 టీఎస్​పీఎస్సీ

TSPSC released Group 1 Prelims results: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్‌కి మల్టీజోన్, రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 చొప్పున 25050 మందిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. మహిళా రిజర్వేషన్లపై.. హైకోర్టు ఆదేశాల మేరకు సమాంతర విధానమే అనుసరించినట్లు స్పష్టంచేసింది. మెయిన్స్ పూర్తివివరాలను.. ఈనెల 18న ప్రకటించనున్నట్లు టీఎస్​పీఎస్సీ తెలిపింది.

గ్రూప్​1 ప్రిలిమ్స్​ ఫలితాలు వెల్లడించిన టీఎస్​పీఎస్సీ

Telangana Group 1 Exam Results Released: గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష ఫలితాలను రాష్ట్రపబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్ -1లో 503 పోస్టులకోసం.. మెయిన్స్‌కి 25050 మంది ఎంపికయ్యారు. మల్టీజోన్, రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున.. 25050 మందిని ఎంపికచేశారు. రెండో మల్టీజోన్ అంధ, బధిర మహిళల రిజర్వేషన్‌లో తగినంత మంది అభ్యర్థులు లేకపోవడంతో.. ఆ పోస్టులకు 50 మంది చొప్పున ఎంపిక చేయలేకపోయినట్లు టీఎస్​పీఎస్సీ తెలిపింది. సమానమార్కులు వచ్చిన వారీలో తెలంగాణ స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు కమిషన్‌ వెల్లడించింది.

స్థానికుల్లో సమానమార్కు వస్తే ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొంది. మహిళలకు వర్టికల్ విధానంలోరిజర్వేషన్లు కల్పించనున్నట్లు నోటిఫికేషన్​లో టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. ఐతే హైకోర్టు ఆదేశాల మేరకు.. సమాంతర విధానాన్ని అనుసరించినట్లు కమిషన్ వెల్లడించింది. ఓఎంఆర్​ పత్రంలో వ్యక్తిగత వివరాలను బబ్లింగ్ చేయకుండా.. తప్పుడుగా ఉన్నవాటిని మూల్యాంకనం చేయలేదని కమిషన్ పేర్కొంది.

జూన్‌లో గ్రూప్‌-1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపిన టీఎస్​పీఎస్సీ.. ఈనెల 18న పరీక్షల పూర్తి విధానాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 503 పోస్టుల కోసం 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2 లక్షల 85 వేల 916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రకటించిన ప్రాథమిక కీపై.. వచ్చిన అభ్యంతరాలు, సబ్జెక్టు నిపుణుల సిఫార్సు మేరకు 5ప్రశ్నలను కమిషనన్‌ తొలగించింది. మొత్తం 150 ప్రశ్నల్లో అయిదింటిని తొలగించినందున..145 ప్రశ్నలను 150కి దామాషా పద్ధతిలో లెక్కించి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు.

న్యాయ పరమైన చిక్కులు రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలవెల్లడిలో జాప్యం జరిగింది. బబ్లింగ్ చేసిన ఓఎంఆర్​ సమాధానపత్రాలనుపరిగణనలోకి తీసుకోవాలంటూ కొందరు అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేయగా.. వాటిని హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లను నిలువు పద్ధతిలో కాకుండా సమాంతరవిధానంలో పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్లు దాఖలు కాగా.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే వ్యవహరించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

హైకోర్టు ఆదేశాల మేరకు నిలుపు పద్ధతిలో కాకుండా సమాంతర విధానాన్నే పరిగణలోకి తీసుకున్నారు. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై సింగిల్‌జడ్జి తీర్పుపై.. టీఎస్​పీఎస్సీ వేచిచూసింది. ఆ తీర్పును టీఎస్​పీఎస్సీ సవాల్ చేయడంతో అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని.. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల చేయవచ్చునని హైకోర్టు ధర్మాసనం అనుమతినిచ్చింది. ఆటంకాలు తొలగిపోవడంతో ప్రిలిమ్స్ ఫలితాలను ఎట్టకేలకు టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 14, 2023, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.