ETV Bharat / state

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసుల నివాళి

author img

By

Published : Jan 30, 2021, 1:29 PM IST

traffic-police-tribute-to-martyrs-on-the-occasion-of-mahatma-gandhi-death-anniversary-in-2021
అమరవీరుల సంస్మరణం... పలు కూడళ్లలో 2 నిమిషాల పాటు మౌనం

అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రాఫిక్ పోలీసులు నివాళులు అర్పించారు. పలు కూడళ్లలో రెండు నిమిషాల పాటు సిగ్నల్స్ నిలిపివేశారు. ఎక్కడివారు అక్కడే ఉదయం 11గంటలకు మౌనం పాటించారు.

హైదరాబాద్ నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు అమరవీరులకు నివాళులు అర్పించారు. జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా... ఉదయం 11 గంటలకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. హైదరాబాద్ అసెంబ్లీ కూడలి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది మౌనం పాటించి నివాళులు అర్పించారు.

పలు కూడళ్లలో రెండు నిమిషాల పాటు ట్రాఫిక్ సిగ్నల్​నూ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. వాహనదారులు ఎక్కడివారు అక్కడే 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఇదీ చదవండి: అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.