ETV Bharat / state

revanth reddy: ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై రేవంత్​రెడ్డి సీరియస్.. ఖబడ్దార్ అంటూ...

author img

By

Published : Oct 28, 2021, 10:04 PM IST

Updated : Oct 28, 2021, 10:12 PM IST

revanth reddy
revanth reddy

ఏపీ మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన కేసీఆర్, జగన్‌ కుట్ర అని టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ జోలికి రావోద్దని హెచ్చరించారు.

కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం... ఏపీ మంత్రి పేర్ని నానీ "సమైక్య రాష్ట్ర" ప్రతిపాదన తేవడం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ కుట్ర అని ధ్వజమెత్తారు. వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి రావొద్దని రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. ప్లీనరీ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలను... కేసీఆర్​ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని మాటలను కలిపి ట్వీట్​ చేస్తూ... రేవంత్​ రెడ్డి విమర్శలు చేశారు.

  • కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది.

    ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”
    ప్రతిపాదన తేవడం…
    కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర.
    వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! pic.twitter.com/Is4fDy8Okk

    — Revanth Reddy (@revanth_anumula) October 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర” ప్రతిపాదన తేవడం… కేసీఆర్, జగన్ “ఉమ్మడి” కుట్ర. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి రావొద్దు. - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

ఇదీ చూడండి: Minister Perni nani: ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Last Updated :Oct 28, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.