ETV Bharat / state

టాప్​ టెన్ న్యూస్​ ​@1PM​

author img

By

Published : Aug 16, 2020, 12:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS AT 1PM
టాప్​న్యూస్​ ​@1PM​

  • ఉప్పొంగుతున్న గోదావరి.. నీట మునిగిన లక్నవరం దీవులు

ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని చెరువులు, కుంటులు నిండాయి. మహబూబాబాద్​ జిల్లాలోని బొగ్గుల వాగు పొంది లక్నవరం సరస్సు నిండింది. రెండు తీగల వంతెనలు, దీవులలోని కాటేజీలు నీట మునిగాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించండి: మంత్రి అల్లోల

నిర్మల్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రతి ఆదివారం పది గంటలకు పది నిముషాలు కార్యక్రమంలో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో పేరుకుపోయిన వర్షపు నీటిని శుభ్రం చేసి, గార్డెన్​లో మొక్కలను సరిచేశారు. ప్రజలందరూ తమ ఇంటి వద్దనున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'శవాలతో డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి'

కరోనా చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి శవాన్ని ఇవ్వకుండా డబ్బు వసూలు చేస్తున్న యశోద ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి ఫిర్యాదు చేశారు. రూ. 8 లక్షల బిల్లు పెండింగ్​లో ఉందని మృతదేహాన్ని ఇవ్వడంలేదని వాపోయారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • కరోనా నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్​ కార్యాలయంలో... కరోనా నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబూటులోకి తీసుకువచ్చారు. సీజనల్​ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున... పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పరికరాలు రూపొందించినట్టు టెస్లా ఇన్​ఫ్రా సంస్థ సీఈవో తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • చికిత్సకు స్పందిస్తున్న ప్రణబ్​.. నిలకడగా ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ కోలుకుంటున్నట్లు ఆయన కుమారుడు అభిజిత్​ ముఖర్జీ తెలిపారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్​ చేశారు. అయితే ఆసుపత్రి వైద్యులు ఇందుకు భిన్నంగా బులెటిన్​ విడుదల చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • చైనా ఆక్రమణకు మోదీ పిరికితనమే కారణం: రాహుల్

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. మోదీ పిరికితనమే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకునేలా చేసిందని ఆరోపించారు. ప్రధాని అబద్ధాలు చెబితే.. అది చైనాకే లాభమని మండిపడ్డారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • కొవిడ్‌ చికిత్స కోసం కొత్త ఔషధం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నయం చేసే ఓ ఔషదాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వినికిడి సమస్య, మానసిక రుగ్మతలకు ఉపయోగించే వ్యాక్సిన్​.. కొవిడ్​ను అడ్డుకోగలదని తేల్చిచేప్పారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఐఐటీ చదువు.. పొలంలో కొలువు

ఐఐటీలో చదువంటే ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల్లో ప్రవేశానికి రాచబాట. లక్షల్లో వేతనం, విదేశీ ప్రయాణాలూ, అద్భుతమైన ఎదుగుదల... ఇలాంటి సౌలభ్యాలెన్నో! కానీ సాయి గోలేను ఇవేవీ ఆకర్షించలేదు. ఎందుకంటే ఆమె తన బాగు కోసం కాకుండా అన్నదాత మేలు గురించి ఆలోచించింది. అందుకే పొలంబాట పట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సాగువైపు తీసుకొచ్చి రైతన్న ఉన్నతికి కృషి చేస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ధోనీ- రైనా వీడ్కోలు: ప్రముఖుల స్పందనలివే..

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్లు ఎంఎస్​ ధోనీ, సురేశ్​ రైనా అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించారు. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లు, సినిమా, రాజకీయ ప్రముఖులు సోషల్​ మీడియా వేదికగా స్పందించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'నీలి నీలి ఆకాశం' రికార్డు.. దక్షిణాది తొలి గీతంగా ఘనత

సంగీత ప్రియులను అలరిస్తున్న 'నీలి నీలి ఆకాశం' పాట.. యూట్యూబ్​లో సంచలన సృష్టించింది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డును నమోదు చేసింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.