ETV Bharat / state

గంట 46 నిమిషాల పాటు చంద్రగ్రహణం.. మూతపడిన ఆలయాలు

author img

By

Published : Nov 8, 2022, 6:45 AM IST

Updated : Nov 8, 2022, 9:37 AM IST

Temples Closed in Telangana due to Lunar Eclipse : ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం నేడు కనిపించనుంది. కొన్ని నగరాల్లో అది సంపూర్ణంగా.. హైదరాబాద్‌లో మాత్రం పాక్షికంగానే కనిపిస్తుందని జి.పి.బిర్లా ఆర్కియలాజికల్‌ ఆస్ట్రోనామికల్‌ అండ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(జీపీబీఏఏఎస్‌ఆర్‌ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేశారు. తిరిగి రేపు ఉదయం ఆలయాలు తెరుచుకోనున్నాయి.

Temples Closed in Telangana due to Lunar Eclipse
Temples Closed in Telangana due to Lunar Eclipse

గంట 46 నిమిషాల పాటు చంద్రగ్రహణం

Temples Closed in Telangana due to Lunar Eclipse: ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం నేడు కనిపించనుంది. కొన్ని నగరాల్లో అది సంపూర్ణంగా.. హైదరాబాద్‌లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40కు ప్రారంభమై.. 7.26 గంటలకు ముగుస్తుంది. గంట 46 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని జి.పి.బిర్లా ఆర్కియలాజికల్‌ ఆస్ట్రోనామికల్‌ అండ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(జీపీబీఏఏఎస్‌ఆర్‌ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.

చంద్రగ్రహణం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేశారు. ఉదయం నిత్య కైంకర్యాల అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్​ లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. ఉదయం మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్య కైంకర్యాల అనంతరం ఉదయం 8.15 గంటలకు ఆలయాన్ని మూసివేసినట్లు వివరించారు. చంద్రగ్రహణం ముగిసిన తరవాత తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు నిర్వహించి, రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం యధావిధిగా ఆలయాన్ని తెరుస్తామని స్పష్టం చేశారు.

భద్రాద్రి ఆలయం మూసివేత..: చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. ఉదయం 7:30 గంటలలోపు మధ్యాహ్న నివేదన ఆరాధనలు పూర్తి చేసి.. ఆలయ తలుపులు మూసివేశారు. సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు తెలిపారు. 7:30 తర్వాత ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ.. దేవతామూర్తులకు అభిషేకాలు పూర్తయిన తర్వాత మళ్లీ మూసివేస్తామన్నారు. రేపు ఉదయం సుప్రభాత సేవ నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వెల్లడించారు.

ధర్మపురి ఆలయం సైతం..: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం కావడంతో కాళేశ్వర ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలను ఉదయం 5.30లకు అర్చకులు ద్వారా బంధనం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి.. అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ చేసి 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం కావడంతో కాళేశ్వర ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలను ఉదయం 5.30లకు అర్చకులు ద్వారా బంధనం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి.. అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ చేసి 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

ధర్మపురి.. కొండగట్టు రెండింటికీ తాళం..: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయాలనూ మూసివేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ, అభిషేకం అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల తరువాత కొండగట్టు ఆలయంలో భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని ఆలయ అధికారులకు వెల్లడించారు.

గ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేతతో స్వామి వార్ల దర్శనాలు, సత్యనారాయణ వ్రతాలు, వాహన పూజలు, నిత్య కైంకర్యాలు, స్వామి వార్ల కల్యాణం, బ్రహ్మోత్సవాలు, ఊరేగింపు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు అందరూ గ్రహించాలని కోరారు. యాదాద్రితో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలలో తిరిగి రేపు ఉదయం నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.

ఇవీ చూడండి..

Solar eclipse 2022: పాతికేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. పోటీపడి వీక్షించిన జనం

Last Updated : Nov 8, 2022, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.