కరోనా సమయంలో రొమ్ము క్యాన్సర్పై మహిళలు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో చివరి రోజు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ సోమాజిగూడలోని రాజ్భవన్ను పింక్ కలర్ విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. రొమ్ము క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తిస్తే జయించవచ్చని.. మహిళల్లో కొత్త మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని గవర్నర్ కోరారు. ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండిః రాజభవన్లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు