ETV Bharat / state

వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

author img

By

Published : Aug 27, 2021, 12:12 PM IST

Updated : Aug 27, 2021, 12:44 PM IST

telangana government
telangana government

12:09 August 27

వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇచ్చే విషయమై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖలోని స్టేట్ ప్రాజెక్ట్స్ వింగ్ కమిషనర్​కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. వరద జలాల ఆధారంగా కృష్ణానదిపై ఏపీ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని లేఖలో పేర్కొన్నారు.  

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్​లోనూ.. అనుమతుల్లేని వాటి జాబితాలో వెలిగొండ ప్రాజెక్టు ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్.. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలకు తరలిస్తోందని గతంలోనే ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఏఐబీపీ కింద నిధులు ఇవ్వడం ఏ మేరకు సబబన్న తెలంగాణ... పీఎంకీఎస్​వై-ఏఐబీపీ కింద నిధులు ఇచ్చేందుకు వెలిగొండ ప్రాజెక్టుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని కోరింది.

Last Updated :Aug 27, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.