ETV Bharat / state

Farmer loan waiver: నాలుగోరోజు 10,958 మంది ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు

author img

By

Published : Aug 19, 2021, 9:25 PM IST

రాష్ట్రంలో రుణమాఫీ పథకం కింద నాలుగో రోజు 10,958 మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమయ్యాయి. రూ.39.40 కోట్లు బదిలీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు.

Farmer loan waiver: నాలుగోరోజు 10,958 మంది ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు
Farmer loan waiver: నాలుగోరోజు 10,958 మంది ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు

రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగో రోజు రుణమాఫీ పథకం కింద 10,958 మంది రైతుల ఖాతాలకు రూ.39.40 కోట్ల నిధులు బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల్లో 61,752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా రుణాల నుంచి రైతులు విముక్తి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరోనా విపత్తులోనూ రైతు శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయ పంటల ఉత్పత్తులు 100 శాతం కొనుగోలు చేశామని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిందని హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి.. విజయవంతంగా అమలు చేస్తున్నారని నిరంజన్​రెడ్డి కొనియాడారు. తెలంగాణలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

నెలాఖరు వరకు రూ.2005 కోట్ల 85 లక్షల రూపాయలు..

ఈ నెలాఖరు వరకు రూ.2005 కోట్ల 85 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని నిరంజన్​రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2014 నుంచి 18 వరకు 16,144 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని గుర్తు చేశారు. 2018లో 25 వేలలోపు రుణాలున్న 2.96 లక్షల మంది రైతులకు 408.38 కోట్ల మేర మాఫీ అయిందని తెలిపారు.

సంబంధిత కథనాలు..

Farmer loan waiver: రూ.50 వేలలోపు మాత్రమే మాఫీ

rythu runamafi: ఇబ్బందులున్నా.. రైతు రుణమాఫీ అమలుచేస్తున్నాం: వ్యవసాయశాఖ మంత్రి

రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం: మంత్రి నిరంజన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.