ETV Bharat / state

తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు

author img

By

Published : Dec 16, 2020, 9:52 PM IST

తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు
తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం తెదేపా ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక కోసం ఆరుగురు సభ్యులతో పార్టీ సమన్వయ కమిటీని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎన్. అమరనాథ్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్‌, ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి, జి.నరసింహ యాదవ్, పనబాక కృష్ణయ్యలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

నాయకులు, కార్యకర్తలందరినీ కమిటీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తుందని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు
తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు

ఇవీచూడండి: డబిర్‌పురలో ఉద్రిక్తత... ఎంఐఎం, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.