ETV Bharat / state

'ఈడీ విచారణ.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం'

author img

By

Published : Dec 1, 2022, 2:07 PM IST

JC PRABHAKAR REACTS ON ED ENQUIRY : ఈడీ ఇచ్చిన ప్రెస్​నోట్ చూశాక ఆనందంగా ఉందని ఏపీ తాడిపత్రి మున్సిపల్​ ఛైర్మన్​ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈడీ విచారణ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి వచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడే కేసు అసలైన రూట్​లో వెళ్తోందని.. ఇందులో అందరూ ఇరుక్కుని.. తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.

'ఈడీ విచారణ.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం'
'ఈడీ విచారణ.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం'

JC PRABHAKAR REACTS ON ED ENQUIRY : BS-3 వాహనాలను BS-4గా రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో ఈడీ విచారణ.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశమని ఏపీ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్​ ఛైర్మన్​ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇప్పుడే కేసు అసలైన రూట్​లో వెళ్తోందని.. ఇందులో అందరూ ఇరుక్కుని.. తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.

'ఈడీ విచారణ.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం'

ఇందులో ముందుగా తనకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్​ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. కాస్త ఆలస్యంగా నైనా అశోక్ లేలాండ్ వారిని ఇందులో చేర్చడం సంతోషమన్నారు. ఇందులో నాగాలాండ్ అధికారులు, పోలీసులు, ఆర్టీవో అధికారులు అందరూ ఇరుక్కుంటారని జేసీ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు సంతోషించదగ్గ విషయం అన్నారు.

ఇవీ చదవండి:

సీబీఐ ఎదుట హాజరైన మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర

మెయిన్స్‌లో మెరవాలంటే.. వీటిపై పట్టు సాధించాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.