ETV Bharat / state

అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం.. రాష్ట్రంలో అగ్రనేతల వరుస పర్యటనలు

author img

By

Published : Jan 11, 2023, 8:53 AM IST

BJP senior leaders Telangana visit : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై మరింత దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో, పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈనెల 19న వందేభారత్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 28న కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాష్ట్రానికి వస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Sunil Bansal State Tour
Sunil Bansal State Tour

రాష్ట్రంలో అధికారమే బీజేపీ లక్ష్యం.. వరస పర్యటనలు చేస్తున్న అగ్రనేతలు

BJP senior leaders Telangana visit : తెలంగాణగడ్డపై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయదళం గులాబీ తోటలో కమలాన్ని వికసింపజేసెందుకు వ్యూహాత్మకంగా ముందుకుసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలలే ఉండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది. సమయం వృథా చేయకుండా అందివచ్చిన ప్రతిఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

BJP senior leaders visits in Telangana : సభలు సమావేశాల పేరిట బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల క్యాలెండర్‌ను సిద్దం చేసుకున్న పార్టీ మూడు నెలలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్‌ బన్సాల్.. నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం కూకట్‌పల్లిలో జరగనున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ భేటీకి సునీల్ బన్సాల్ హాజరుకానున్నారు.

మధ్యాహ్నం రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగే పార్లమెంట్‌ కన్వీనర్, సహకన్వీనర్, పార్లమెంట్‌ ప్రభారీ, పార్లమెంట్ విస్తారక్ భేటీలో పాల్గొననున్నారు. రేపు ఉదయం పఠాన్‌చెరువులో జరిగే మెదక్ పార్లమెంట్‌ నియోజకవర్గం, మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశంలో సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు, బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలు వాటిపై ప్రజాఉద్యమాలను కార్యరూపంలోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ గతేడాది నాలుగుసార్లు తెలంగాణకురాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా 5 సార్లు రాష్ట్రంలో పర్యటించారు. కమలదళపతి నడ్డా సైతం నాలుగుసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చారు.

19న మోదీ, 28న అమిత్‌షా రాష్ట్ర పర్యటన: ఈ ఏడాది తొలిసారిగా ఈనెల 19న మోదీ 28న అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. వచ్చేఎన్నికలే ప్రధాన అజెండాగా అమిత్‌షా టూర్‌ సాగనుంది. రెండు రోజుల పాటు అమిత్​షా రాష్ట్రంలోనే ఉండి పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టిసారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిలోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.

అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశంపై అమిత్‌షా దిశానిర్దేశం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ శ్రేణులు, నాయకులతోపాటు సంఘనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో టికెట్ ఎవరికిస్తే బాగుటుందనే అంశంపై 119 అసెంబ్లీనియోజకవర్గాల్లో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సర్వే చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో సంఘ నేతలతో అమిత్​షా భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.