ETV Bharat / state

'లీడర్ కేంద్రంగా కాదు పార్టీ కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహించాలి'

author img

By

Published : Jan 11, 2023, 9:35 PM IST

తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ప్రజల్లోకి వెళ్లడానికి విస్తృతంగా ప్రణాళికలను రచిస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

సునీల్ బన్సల్
సునీల్ బన్సల్

లీడర్ కేంద్రంగా కాదు.. పార్టీ కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర నేతలకు సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నేతలతో సమావేశమైన బన్సల్.. ఎవరో ఆపుతున్నారు, పని చేయనీయడం లేదు, వారు రావడం లేదు అనే కారణాలు చెప్పొద్దన్నారు. శక్తి కేంద్రాల వారీగా జరిగే వీధి సభలకు స్వచ్ఛందంగా హాజరు అయ్యే వారితోనే నిర్వహించాలన్నారు. 3 వందల నుంచి 5 వందల మందితో సభలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.