ETV Bharat / state

'రజినీకాంత్ క్షేమంగానే ఉన్నారు..వదంతులు తగదు'

author img

By

Published : Dec 26, 2020, 3:02 PM IST

సూపర్​ స్టార్​ రజినీకాంత్​ ఆరోగ్యంగానే ఉన్నారని రజినీ తెలంగాణ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్​ దేచపల్లి తెలిపారు. ఆయన ఆరోగ్యం విషయంలో సామాజిక మాధ్యమాల్లో ఎవరూ వదంతులు సృష్టించవద్దని​ విజ్ఞప్తి చేశారు.

rajini
'రజినీ ఆరోగ్యంపై వదంతులు తగదు.. ఆయన క్షేమమే'

సూపర్​స్టార్​ రజినీకాంత్ ఆరోగ్యం విషయంలో సామాజిక మాధ్యమాల్లో ఎవరూ వదంతులు సృష్టించవద్దని రజినీ తెలంగాణ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ దేచపల్లి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, డిసెంబర్ 31న నూతన పార్టీపై ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రజినీ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న శ్రీకాంత్.. శుక్రవారం నుంచి హైదరాబాద్​లోని అపోలో ఆస్పత్రి వద్దే ఉంటూ అభిమానులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని, వాటన్నింటిని వెంటనే తొలిగించాలని కోరారు.

అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురైన రజినీ.. శుక్రవారం అపోలోలో చేరారు.

'రజినీ ఆరోగ్యంపై వదంతులు తగదు.. ఆయన క్షేమమే'

ఇదీ చదవండి: ఇన్​స్టంట్​ 'లోన్'​ యాప్​ల​పై కమిషనర్​ వీడియో సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.