కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. మొదటిసారి దేశంలో నాగరికత, మతంతో ముడిపెడుతూ ఒక బిల్లును తేవడంపై ఆయన మండిపడ్డారు. కొన్ని దేశాలను మినహాయించడం... ఒక మతాన్ని విస్మరించడం హాస్యాస్పదమన్నారు.
ఈ చర్యలు మతోన్మాద రాజకీయాల కోసం తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జనవరి 30న సీఎం కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభకు తమను ఆహ్వానిస్తే ఆలోచిస్తామని... సీపీఎంతో పాటు అందరినీ పిలువాలని సీతారం కోరారు.
ప్రజల ఉద్యమాల ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ... బెంగాల్, త్రిపురలో తిరిగి అధికారంలోకి వస్తామంటున్న సీతారాం ఏచూరితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి
ఇవీ చూడండి: 'పుర'పోరుపై రేపు రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం