ETV Bharat / state

TSPSC Paper Leakage Case : టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్​

author img

By

Published : May 25, 2023, 5:30 PM IST

TSPSC paper leakage case
TSPSC paper leakage case

TSPSC Paper Leakage Case Latest Updates : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. సుచరిత, శాంతి, రాహుల్​ అనే ముగ్గురు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని వివిధ కోణాల్లో ప్రశ్నించి కీలక సమాచారం రాబడుతున్నారు.

TSPSC Paper Leakage Case Latest Updates : టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సుచరిత, శాంతి, రాహుల్​లను మూడు రోజుల కస్టడీలో భాగంగా.. వారిని చంచల్​గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలోనే నిందితులను ప్రశ్నించి కీలక సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్​ ఉద్యోగి రాజశేఖర్​రెడ్డి భార్య సుచరిత, ఏఈ ప్రశ్నాపత్రం కేసులో నిందితుడిగా ఉన్న రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి, డివిజినల్ అకౌంట్స్ అధికారి పరీక్ష రాసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది.

నిందితులతో ఉన్న సంబంధాలపై దృష్టి : టీఎస్​పీఎస్సీ అధికారులు డీఏఓ పరీక్ష జవాబు పత్రాలను మదింపు చేసి.. అధిక మార్కులు సాధించిన వాళ్ల జాబితాను సిట్​కు ఇచ్చారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆయా అభ్యర్థుల పూర్తి వివరాలు సేకరించి.. నిందితులతో ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టారు. దీంతో సుచరిత, శాంతిలు సైతం.. ప్రశ్నాపత్రం తీసుకొని పరీక్ష రాసి అధిక మార్కులు పొందినట్లు దర్యాప్తులో తేలింది.

39 మంది అరెస్ట్ : ప్రశ్నాపత్రం ఎప్పుడు చేతికి అందింది, ఎక్కడ చదివారు.. ఇంకెవరికైనా ప్రశ్నలను చెప్పారా అనే కోణంలో సిట్ అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. రాహుల్ సైతం ప్రశ్నాపత్రాలను విక్రయించినట్లు గుర్తించారు. దానిని ఎవరెవరికి విక్రయించి ఎంత సొమ్ము చేసుకున్నాడనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు 39మందిని అరెస్ట్ చేశారు.

మరోవైపు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్​ కమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రోజుల తరబడి ప్రశ్నించిన సిట్ అధికారులు.. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కష్టసాధ్యమైన పనికి వారు సిద్ధమయ్యారు. గ్రూప్‌1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షలు రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను పరిశీలించాని నిర్ణయించారు. ఒక్కో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఆధారంగా లిస్ట్​ను తయారు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల వివరాలను వేరు చేశారు.

అసలు నిందితుల గుర్తింపు : అందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అభ్యర్థుల ఫోన్‌ నంబర్లను గుర్తించి.. విచారించే పనిలో పడ్డారు. వారి బ్యాంకు ఖాతాలను సైతం పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు.. సిట్‌ అధికారులు కొన్ని ప్రశ్నావళిని రూపొందించి సమాధానాలు రాబట్టారు. వాటిని అంచనా వేసి అసలు నిందితులను గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో ఏడు, ఎనిమిది తేెదీల్లో టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: TSPSC PAPER LEAK UPDATE: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో మరో ముగ్గురు అరెస్టు

Governor Tamilsai interesting comments : 'నూతన సచివాలయం అద్భుతం.. కానీ ఆహ్వాన పత్రికైనా పంపలేదు'

కొత్త పార్లమెంట్​ ఓపెనింగ్​పై సుప్రీంకోర్టులో కేసు.. విమర్శల దాడి పెంచిన కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.