ETV Bharat / state

Revanth Reddy Comments on his Security : 'భద్రత విషయంలో నన్ను భయపెట్టాలని చూడకండి.. అస్సలు భయపడే వ్యక్తినే కాను'

author img

By

Published : Aug 18, 2023, 10:10 PM IST

Revanth Reddy Interview
Revanth Reddy on CM KCR Security

Revanth Reddy reaction about his Security : సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు సీఎం కేసీఆర్​ వెళ్లగలరా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ సవాల్​ విసిరారు. హైదరాబాద్​లో జాతీయ ఛానళ్లతోపాటు తెలుగు న్యూస్​ ఛానళ్లతో చిట్​చాట్ నిర్వహించిన రేవంత్​.. ​తాను ప్రజల మనిషినని.. భద్రత లేకుండా ఎక్కడికైనా వెళ్లగలనని స్పష్టం చేశారు. తనకు 69 మందితో భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను పట్టించుకోలేదని మండిపడ్డారు. కొందరు అధికారులు బీఆర్​ఎస్​కి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

Revanth Reddy fires on KCR : భద్రత విషయంలో తనను భయపెట్టాలని చూస్తే తాను భయపడే వ్యక్తిని కాదని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ప్రజల మనిషిననన్న రేవంత్.. భద్రత లేకుండా ఎక్కడికైనా వెళ్లగలనని పేర్కొన్నారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా(OU), కాకతీయ యూనివర్సిటీ(KU)లకు సీఎం కేసీఆర్‌ వెళ్లగలరా అని ప్రశ్నించారు. తనను ఓడించడానికి కేసీఆర్‌ పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు. తనకు 69 మందితో భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కావల్సినంత భద్రత కల్పించామని గుర్తు చేశారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనకు సైన్యంలా భద్రత ఉంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ, మైనార్టీ అనే తేడా ఉండదని, పార్టీలో మైనార్టీలు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ మైనార్టీల కోసం ఏమి చేయలేదని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో (Double Bedroom Houses) ఒక్క శాతమైనా మైనార్టీలకు దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ హైదరాబాద్‌లో కారు బయల్దేరితే అది దిల్లీ వెళ్లినప్పటికి కమలంగా మారిపోతోందని ఎద్దేవా చేశారు.

Revanth Reddy Interview : బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనన్న రేవంత్‌ రెడ్డి.. మైనార్టీ ఓట్లను కేసీఆర్‌.. బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మైనార్టీలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజావ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదని పునరుద్ఘాటించారు. తాము బీజేపీకి (BJP) వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, బడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తామన్న రేవంత్‌... బీఆర్ఎస్ వాళ్లు అలా చెప్పగలరా? అని ప్రశ్నించారు.

Revanth Reddy comments on police : ప్రభుత్వ శాఖల్లో కొందరు అధికారులు బీఆర్‌ఎస్‌కి కొమ్ముకాస్తున్నారని.. అలాంటి అధికారుల పేర్లను రెడ్‌ బుక్‌లో తప్పకుండా రాస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే అధికారులను వదిలిపెట్టేది లేదని రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ఇదే సందర్భంలో తాను మాట్లాడేది.. ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనేనని గుర్తు చేశారు.

Revanth Reddy Political News : ప్రజల కోసం పని చేసే అధికారులంటే తనకు ఎంతో గౌరవమేనని చెప్పుకొచ్చారు. కొందరు అధికారులు రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పదేళ్ల కాలంలో చేయనిది రెండు నెలల్లో ఏలా చేస్తారని ప్రశ్నించారు. కోకాపేట (Kokapet land auction), బుద్వేల్‌ల్లో భూములు కొనుగోలు చేసిన సంస్థలు కేసీఆర్‌ బినామీలు, బీఆర్‌ఎస్‌ నాయకులేనని రేవంత్ ఆరోపించారు.

Minister Srinivas Goud fires on Revanth Reddy : " రేవంత్​రెడ్డి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు: శ్రీనివాస్​గౌడ్​"

Telangana Congress Applications From MLA Ticket Aspirants : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్​కు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.