ETV Bharat / state

సెక్యూరిటీ కౌన్సిల్​ కార్యాలయాన్ని ప్రారంభించిన రాచకొండ సీపీ

author img

By

Published : May 23, 2020, 5:22 PM IST

తెలంగాణ ప్రభుత్వం, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వేతర, ఐటీ సంస్థల మధ్య సుస్థిరమైన, భద్రతాపరమైన సహకార, సంబంధాలు నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్​ భవనాన్ని సీపీ మహేష్​ భగవత్​ ప్రారంభించారు. సంస్థలకు, ఉద్యోగులకు భద్రత కల్పించే దిశగా ఈ సంస్థ పని చేస్తుందని సీపీ తెలిపారు.

Rachakonda Cp Inaugurates Security Council Building
సెక్యూరిటీ కౌన్సిల్​ కార్యాలయాన్ని ప్రారంభించిన రాచకొండ సీపీ

గతేడాది డిసెంబర్​ నెలలో ఏర్పాటు చేసిన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్​ కార్యాలయ భవనాన్ని సీపీ మహేష్​ భగవత్​ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం, రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు, ఐటీ సంస్థల మధ్య సహకార, సంబంధాలు పటిష్టం చేసేందుకు ఈ సంస్థ పని చేస్తుందని సీపీ తెలిపారు. మహిళల భద్రత, రహదారి భద్రత, సైబర్​ నేరాల నుంచి భద్రత కల్పిస్తూ సంస్థలకు అవగాహన కల్పిస్తుందని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.