ETV Bharat / state

'శాంతి, అహింసలే ఆయన ఆయుధాలు... మనకు మార్గదర్శకాలు'

author img

By

Published : Jan 30, 2020, 12:12 PM IST

political leaders pays tribute to mahatma gandhi at bapu ghat in hyderabad on his death anniversary
'శాంతి, అహింసలే ఆయన ఆయుధాలు... మనకు మార్గదర్శకాలు'

శాంతి, అహింసను ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని హిమాచల్​ప్రదేశ్ ​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ కొనియాడారు. గాంధీ 63వ వర్ధంతి పురస్కరించుకుని పలువురు ప్రముఖులు హైదరాబాద్​ బాపూఘాట్​ వద్ద నివాళులు అర్పించారు.

'శాంతి, అహింసలే ఆయన ఆయుధాలు... మనకు మార్గదర్శకాలు'

మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్​ బాపూఘాట్​ వద్ద నివాళులు అర్పించారు. భారతదేశానికి మహాత్ముడు చేసిన సేవలను కొనియాడారు.

హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని బాపూఘాట్​ వద్ద మహాత్మాగాంధీకి గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి నివాళులు అర్పించారు.

మహాత్ముడి ఆశయాల కోసం దేశ పౌరులు, యువత కృషి చేయాలని దత్తాత్రేయ సూచించారు. గాంధీ ఆశయాలు కొనసాగించడమే ఆయనకు ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.

విశ్వశాంతికి కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.