ETV Bharat / state

సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు - ఐదుగురు నిందితుల అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 1:40 PM IST

Updated : Jan 7, 2024, 3:36 PM IST

Police Investigating Rayadurgam Kidnapping Case : అటవీశాఖ అధికారులు తెగువతో కిడ్నాపర్ల నుంచి రక్షించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుర్రం సురేంద్ర కిడ్నాప్​ కేసును రాయదుర్గం పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ ఇన్​ఛార్జి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 7 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Rayadurgam Kidnapping Case
Police Investigating Rayadurgam Kidnapping Case

Rayadurgam Kidnapping Case : సాఫ్ట్​వేర్ ఇంజినీర్ సురేందర్ కిడ్నాప్ కేసును 48 గంటల్లో రాయదుర్గం పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరోకరు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ ఇన్​ఛార్జి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 7 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైనా సురేశ్​పై గతంలో 21 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పీడీ యాక్ట్‌ కింద నిందితులపై కేసు చేసి నమోదు చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అసలేం జరిగిందంటే.. నల్గొండ జిల్లాకు చెందిన గుర్రం సురేంద్ర కేపీహెచ్‌బీలో(KPHB) నివాసముంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఏడు గంటలకు తన బాబాయి కూతురితో కలిసి నగరంలోని ఖాజాగూడ చెరువు దగ్గరకు సరదాగా వచ్చారు. అప్పటికే అక్కడ పాత నేరస్థుడు, మెహదీపట్నం భోజగుట్టకు సురేశ్​తోపాటు మరో నలుగురు కిడ్నాపర్లు ఎదురుచూస్తున్నారు.

వారు సురేంద్రతో మాట్లాడుతున్నట్లుగా నటించి బలవంతంగా కారులోకి ఎక్కించారు. నిందితులు సురేంద్రను చితకబాదుతూ ఔటర్‌ మీదుగా నగరం దాటేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ చేరుకోగానే కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న కారు చెడిపోయింది. నిందితులు మరో కారు కోసం సురేంద్రతో అతని భార్యకు ఫోన్‌ చేయించారు. కడ్తాల్‌ దగ్గర కారు ఆగిందని వెంటనే మరో వాహనం పంపించాలని కోరారు.

'బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించాం'

Kidnapping Case : ఈ విషయం పోలీసులకు, ఇతరులకు చెబితే ఆత్మహత్య చేసుకుంటానని సురేంద్రతో చెప్పించినట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద దట్టమైన అటవీప్రాంతంలో అర్థరాత్రి వేళ బైర్లూటీ చెక్‌పోస్టుకు సమీపంలో ఒక కారు ప్రధానదారిలో కాకుండా మరో మార్గంలో వెళ్లడాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు.

వెంటనే వాహనాన్ని ఆపేందుకు యత్నించగా వారు వేగంగా ముందుకు వెళ్లడంతో సిబ్బంది అప్రమత్తమై కారును కొద్దిదూరం వెంబడించారు. ఓ మలుపు దగ్గర నిందితులు కారు వెనక్కి తిప్పి పారిపోయే సమయంలో బారికేడ్లను ఢీకొట్టి ఆగింది. సిబ్బంది అడ్డగించి ప్రశ్నిస్తుండగా వెనక నుంచి కిడ్నాప్‌ చేశారంటూ సురేంద్ర గట్టిగా కేకలు వేశాడు.

Tirupati Reddy Kidnapping Case : స్థిరాస్తి వ్యాపారి తిరుపతిరెడ్డి ఆచూకీ లభ్యం.. అసలేం జరిగింది?
Rayadurgam Police Investigation : సిబ్బంది అప్రమత్తమయ్యేలోగా వెనుక సీట్లలో కూర్చున్న నిందితుడు భోజగుట్టకు చెందిన షిందె రోహిత్, మరొకరు అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. సురేంద్ర కారు నుంచి బయటకు వచ్చాడు. ముందు భాగంలో కూర్చున్న నిందితులు వేగంగా కారులో పారిపోయారు. తదనంతరం ఓ యువకుడు చెక్‌పోస్టుకు కొద్దిదూరంలో లిఫ్టు కోసం వాహనాల్ని ఆపుతున్నాడు.

అనుమాన మొచ్చి అటవీ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా కిడ్నాపర్లలో ఒకరైన షిందే రోహిత్‌ అని వెల్లడైంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కారులో పారిపోయిన మరోఇద్దరు నిందితుల గాలింపు చేపట్టారు. సురేంద్రను రక్షించిన అనంతరం వివరాలు సేకరించిన అధికారులు రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కిడ్నాప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం : రాయదుర్గం పోలీసులు శుక్రవారం అర్థరాత్రి 2 గంటలకు ఆత్మకూరు వెళ్లారు. సురేంద్రను శనివారం తెల్లవారుజామున 7 గంటలకు పోలిస్ స్టేషన్​కు తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కిడ్నాప్‌ వెనుక సమీప బంధువుల్లోని ఒకరు ఉన్నట్లు ప్రాథమిక సమాచారంలో తెలిసింది. ఆమె స్నేహితుడు భోజగుట్టకు చెందిన పాత నేరస్థుడు, కిడ్నాపర్‌ సురేశ్‌కు పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుడు సురేంద్ర గురువారం సాయంత్రం ఖాజాగూడ దగ్గర ఉన్న విషయం, కిడ్నాప్‌ జరిగాక కేపీహెచ్‌బీలోని నివాసానికి ఎవరెవరు వస్తున్నారో అంతా మహిళ కొందరికి సందేశాలు పంపినట్లు తెలిసింది.

"సాఫ్ట్​వేర్ ఇంజినీర్ సురేందర్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశాం. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 7 చరవాణులను స్వాధీనం చేసుకున్నాం. ప్రధాన నిందితుడైన సురేశ్​పై గతంలో 21 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి". - శ్రీనివాస్, మాదాపూర్ ఇన్​ఛార్జి డీసీపీ

సాఫ్ట్​వేరు ఇంజినీర్​ కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు అయిదుగురి నిందితుల అరెస్ట్

Malkajgiri Boy Kidnap Case Updates : 'డబ్బులు అందగానే.. బాలుడిని పిచ్చోడిని చేసేద్దాం'

Ghatkesar Child Kidnap Case : ఘట్​కేసర్‌లో కిడ్నాపైన చిన్నారి కథ సుఖాంతం.. పోలీసులపై స్థానికుల ప్రశంసలు

Last Updated : Jan 7, 2024, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.