ETV Bharat / state

తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 9:25 AM IST

Opposition Parties Telangana Elections Campaign 2023 : నామినేషన్లపర్వం ప్రారంభం కావటంతో అటు విపక్షాలు సైతం ప్రచారంలో జోరు పెంచాయి. అధికార పార్టీకి ధీటుగా ఊరూరా చుట్టేస్తున్న అభ్యర్థులు.. రోడ్‌షోలు, సభలు, పాదయాత్రలుగా వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఆ పార్టీ అభ్యర్థులు.. బీఆర్ఎస్ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు.

Telangana Election Campaign 2023
Opposition Parties Telangana Elections Campaign 2023

తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం

Opposition Parties Telangana Elections Campaign 2023 : ప్రచార రథాల రాక, మైకుల మోత, నేతల పర్యటనలు, కార్యకర్తల హడావిడితో పల్లెలు పట్టణాల్లో రాజకీయ కోలాహాలం నెలకొంది. ఎన్నికల గడువు నెల రోజులు కూడా లేకపోవటంతో.. తెల్లవారింది మొదలు.. సాయంత్రం పొద్దుబోయేదాకా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల సమావేశానికి ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. పార్టీ ప్రకటించిన 6గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు వారు దిశానిర్దేశం చేశారు.

Telangana Election Campaign 2023 : మల్కాజిగిరి పరిధిలోని వెంకటాపూర్‌ డివిజన్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతురావు పాదయాత్ర చేస్తూ.. ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ పీర్జాదిగూడలో మేడ్చల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి షామా మహ్మద్‌, నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేశ్‌తో కలిసి పర్యటించారు. కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి వైఎస్‌ఆర్‌టీపీ ఔట్ - కాంగ్రెస్​కు మద్దతు

Congress Telangana Elections Campaign 2023 : బీసీలపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీఎచ్ విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్‌ను గాలి అనిల్‌ కుమార్‌కు ఇవ్వకపోవటాన్నినిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా పరకాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. తొలి రోజు ప్రచారంలో భాగంగా కటాక్షపూర్, హౌస్ బుసర్గు, కందిబండ, నీరుకుల్ల, పెంచికలపేట, కామారం, పెద్దాపూర్ గ్రామాల్లో పర్యటించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్నికారెడ్డి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు పోలీసులు అధికారులు అధికార బీఆర్ఎస్​కు అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని తక్షణమే బదిలీ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్​ను కలిసి ఆయన పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అంబర్‌పేట్‌లో సమావేశం ఏర్పాటు చేసిన పార్టీ అభ్యర్థి కృష్ణయాదవ్.. నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు.

రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ పార్టీల మధ్యే ప్రధాన పోరు

ముషీరాబాద్‌లో జరిగిన సమావేశానికి హాజరైన బీజేపీ అభ్యర్థి పూస రాజు.... బీఆర్ఎస్​కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ 25వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు అర్బన్ బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. కామారెడ్డిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. పార్టీ శ్రేణులతో కలిసి ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించిన ఆయన.. కేసీఆర్​ను గజ్వేల్‌లో ఈటల, కామారెడ్డిలో రమణారెడ్డి ఓడిస్తారన్నారు.

Telangana Assembly Elections 2023 : షాద్‌నగర్‌ టికెట్‌ బీజేపీ తనకు కేటాయించకపోవటం పట్ల ఆ పార్టీ నేత పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ నేతల తీరును ప్రశ్నించారు. కూకట్‌పల్లి సీటును పొత్తుల పేరుతో జనసేనకు కేటాయించవద్దంటూ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. బీజేపీ గెలిచే అవకాశాలున్న చోట జనసేనకు సీట్లు కేటాయించటం సరైంది కాదంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆ పార్టీ జాతీయ నాయకులను కోరారు.

ఈ మేరకు దిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న ఆయన.. శేరిలింగంపల్లి, తాండూరు సీట్లను జనసేనకు ఇస్తే బీజేపీకు నష్టం జరుగుతుందని చెప్పినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన సీపీఎం జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు హాజరయ్యారు. ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్టులకు మద్దతుగా నిలవాలని వారు కోరారు.

కొల్లాపూర్ పోలీసులపై ఈసీకి జూపల్లి ఫిర్యాదు

'కాంగ్రెస్, బీజేపీ ముసుగులో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.