హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి, ఓ ద్విచక్రవాహనం, రూ.1150 రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
గౌస్నగర్లో ఓ వ్యక్తి అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడు చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన సాబేర్గా గుర్తించారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు