ETV Bharat / state

'రాష్ట్రం నుంచి నిఖత్​ పాల్గొనడం గర్వకారణం'

author img

By

Published : Mar 7, 2021, 3:23 AM IST

రాష్ట్ర బాక్సర్​ నిఖత్‌ జరీన్​ను స్పోర్ట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్ ‌రెడ్డి అభినందించారు. ఇస్తాంబుల్‌ ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్​ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో నిఖత్​ పాల్గొననున్న నేపథ్యంలో ఆయన ప్రశంసించారు.

nikhat-zareen-from-telangana-is-proud-to-participate-in-international-boxing-tournament
'రాష్ట్రం నుంచి నిఖత్​ పాల్గొనడం గర్వకారణం'

రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీలో పాల్గొనడం తెలంగాణకు ఎంతో గర్వకారమని స్పోర్ట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. నిఖత్‌ ఇంటర్నేషనల్‌ ఇస్తాంబుల్‌ స్పోర్ట్స్​ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో.. 51 కేజీల ఎలైట్​ ఉమెన్​ విభాగంలో భారత్​ తరపున పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈ నెల 15 నుంచి 21 వరకు ఇస్తాంబుల్​, టర్కీలో జరగనున్న బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ తరపున ఎలైట్​ పురుషుల్లో 13 మంది, ఎలైట్​ మహిళల్లో 11 మంది పాల్గొంటారని ఆయన వెల్లడించారు. నిఖత్‌ జరీన్​ 51 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుందని చెప్పారు.

ఆ టోర్నమెంట్​లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధిస్తే టోక్యో, జపాన్​లో జరగబోయే ఒలింపిక్స్​లో పాల్గొనడానికి అర్హత సాధించానుందని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి నిఖత్ జరీన్​ను అభినందించారు.

ఇదీ చూడండి : 'తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి ఎన్నారైలు కృషి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.