ETV Bharat / state

సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ: నిరంజన్‌రెడ్డి

author img

By

Published : May 26, 2021, 4:09 PM IST

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ అమలు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్థిష్టమైన మానవ వనరుల ప్రణాళిక, తదితర అంశాలపై సమీక్షించారు.

సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ:
సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ:

హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్థిష్టమైన మానవ వనరుల ప్రణాళిక, తదితర అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి సమీక్షించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ అమలు చేయనున్నామని తెలిపారు.

హెచ్‌ఆర్‌ విధానానికి సంబంధించి కమిటీ వెంటనే నివేదిక సమర్పించినట్లైతే... ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. ఇది అమల్లోకి వస్తే 800 పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న 2,500 మందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పదోన్నతులు లేవన్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న సిబ్బంది... భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడి కొనసాగించాలని ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవ వేతనం అంశం విస్తృత చర్చకు వచ్చిన దృష్ట్యా... సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య, టెస్కాబ్ ఎండీ మురళీధర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.