ETV Bharat / state

'ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే.. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి..?'

author img

By

Published : Nov 23, 2022, 9:35 PM IST

LOKESH
LOKESH

LOKESH ON MP MOBILE MISSING: ఆంధ్రప్రదేశ్​ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలీలో విమర్శించారు. ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన​ ప్రశ్నించారు. పోలీసులంతా ఫోన్​ వెతకటం కోసం వెళ్తే.. సామాన్యుల భద్రత ఎవరు చూస్తారని నిలదీశారు.

NARA LOKESH ON MP VIJAYASAI MOBILE MISSING: దొంగ ఇంట్లోనే మరో దొంగ పడ్డాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని​ ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్​ చోరీ గురించి స్పందించారు. ఒక ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి సెల్‌ఫోన్‌లోని వివరాలు ప్రజలకు తెలియాలని డిమాండ్​ చేశారు. దిల్లీ మద్యం స్కామ్‌, బ్రెజిల్ వ్యాపార వివరాలు అన్ని ఫోన్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సెల్‌ఫోన్‌ వెతికే పనిలో ఉన్నారన్న లోకేశ్‌.. పోలీసులంతా అటే వెళ్తే సామాన్యుల భద్రత ఎవరు చూస్తారని నిలదీశారు.

విజయసాయి ఫోన్​ మిస్​: వైఎస్సార్​​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్​ఫోన్ పోగొట్టుకున్నట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21 నుంచి సెల్​ఫోన్​ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్​ఫోన్​ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్​లో అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.