పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును కారు గుర్తుపై వేసి వాణీదేవిని... గెలిపించాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాల క్రిష్ణ, పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదీ చూడండి: విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసది పేగుబంధం: కేటీఆర్