ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేకే

author img

By

Published : Mar 12, 2021, 3:32 PM IST

జూబ్లీహిల్స్​లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేకే
జూబ్లీహిల్స్​లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేకే

జూబ్లీహిల్స్​లో తెరాస నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకుని తెరాస అభ్యర్థిని గెలిపించాలని ఆపార్టీ సీనియర్​ నాయకులు కె.కేశవరావు విజ్ఞప్తి చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును కారు గుర్తుపై వేసి వాణీదేవిని... గెలిపించాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కోరారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం జూబ్లీహిల్స్​ మాజీ కార్పొరేటర్​ కాజా సూర్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాల క్రిష్ణ, పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఇదీ చూడండి: విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసది పేగుబంధం: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.