గర్భిణీలను ఆరోగ్యంగా ఉంచడానికి కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మిసెస్ మామ్స్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు.
ఈమేరకు హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో సమావేశం నిర్వహించారు. గర్భిణీలను ఆరోగ్యంగా, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు. వారిని ఆనందంగా ఉంచడానికి గత నాలుగు సంవత్సరాలుగా ఈ మామ్స్ కాంటెస్ట్ను నిర్వాహిస్తున్నామని పేర్కొన్నారు. గర్భిణీలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిల్పిరెడ్డి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోటీని నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రసూతి సేవల్లో ఐదో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా..