అందుబాటులోకి TSRTC ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులు.. ప్రైవేట్​ బస్సులకు దీటుగా..!

author img

By

Published : Mar 27, 2023, 1:41 PM IST

TSRTC AC Sleeper Buses

Minister Puvvada on TSRTC AC Sleeper Buses : హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో టీఎస్‌ఆర్టీసీ 9 ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్‌ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రాంరంభించారు. కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టగా.. వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ సజ్జనార్... ఈ ఏడాది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

Minister Puvvada on TSRTC AC Sleeper Buses : అత్యాధునికమైన హంగులు జోడించిన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్​ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ఈ బస్సులలో అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 16 బస్సులను కొనుగోలు చేయగా.. అందులో 9 బస్సులను ఇవాళ హైదరాబాద్​లోని ఎల్బీనగర్​ చౌరస్తాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన బస్సులను పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నడపనున్నారు.

త్వరలో గ్రేటర్​ హైదరాబాద్‌ పరిధిలో ఈవీ బస్సులు : కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టగా.. వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రైవేటు బస్సులకు దీటుగా ఈ లహరి బస్సులు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ సజ్జనార్.. ఈ ఏడాది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. త్వరలోనే విజయవాడ- హైదరాబాద్ మధ్య ఇంటర్ సిటీ బస్సులు కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు.

'త్వరలో 1,300 ఈవీ బస్సులు తీసుకొస్తున్నాం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను వాడుతున్నాం. రాబోయే రోజుల్లో మరికొన్ని బస్సులు తీసుకువస్తాం. ఆర్టీసీ ట్రాన్స్​పోర్టేషన్‌ పెరగడానికి కృషి చేస్తాం. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. త్వరలో ఆక్యుపెన్సీ పెరుగుతుందని ఆశిస్తున్నాను. కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోంది. సజ్జనార్‌... సాంకేతికను వాడి ఆర్టీసీ ఆదాయం పెంచుతున్నారు.'-పువ్వాడ అజయ్​కుమార్, రవాణా శాఖ మంత్రి

ప్రైవేటు బస్సులకు దీటుగా.. ప్రారంభమైన 'లహరి' ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు

ఇవాళ 9 స్లీపర్ ఏసీ బస్సులు ప్రారంభించామని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామన్న ఆయన.. బెంగళూరు, చెన్నై, తిరుపతికి స్లీపర్ బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఇటీవల ప్రారంభించిన 12 నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరిగానే ఈ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి- అమ్మఒడి అనుభూతి’గా సంస్థ నామకరణం చేసింది.

ఇవీ సదుపాయాలు :

  • ఈ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులలో ప్రయాణికుల భద్రతకు ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ‘పానిక్‌ బటన్‌’ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉండేలా వీటిని రూపొందించారు.
  • ఈ లహరి ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్‌ డిటెక్షన్‌- అలారం సిస్టమ్​ను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం లాంటి అత్యాధునిక హంగులను జోడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.