ETV Bharat / state

పెళ్లి పేరుతో మోసం…. కిలాడీ అరెస్ట్!

author img

By

Published : Nov 21, 2019, 10:53 PM IST

Updated : Nov 21, 2019, 11:58 PM IST

పెళ్లి పేరుతో మోసం…. కిలాడీ అరెస్ట్!

పెళ్లి పేరుతో ఇటీవ‌ల మోసాలు పెరిగాయి. ఇందుకు ఆన్‌లైన్ సైట్లు వేదిక అవుతున్నాయి. మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఫేక్ ప్రొపైల్స్ పెట్ట‌డం. ఆక‌ర్షించే బ‌యోడేటాను ఉంచ‌డం.. ఆత‌ర్వాత ఎవ‌రైనా ఆన్​లైన్​లోకి వ‌స్తే వారిని పెళ్లి పేరుతో మోసం చేయ‌డం సాధారణమైంది. అయితే తాజాగా పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఓ కిలాడీని ఇప్పుడు సైబ‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు.

మాట్రిమోనీ సైట్‌ని వాడుకుని ఒక యువతిని మోసం చేసాడు ఫిజియో థెర‌పి విద్యార్థి బాణోత్ సాయినాథ్. ఖ‌మ్మంకి చెందిన సాయినాథ్‌ని రాచ‌కొండ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. మాట్రిమోనీలో అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ నుంచి బాధితురాలి ఫోటోలు, ఫోన్ నెంబ‌ర్ తీసుకుని వాట్సాప్ ద్వారా త‌న పేరు అవినాష్ రెడ్డి అని చెప్పి చాట్ చేశాడు.

కొన్నాళ్ల స్నేహం త‌ర్వాత‌ పెళ్లి చేసుకుంటాన‌ని ఆమెను న‌మ్మించాడు. ఇలా.. మాయ‌మాట‌లు చెప్పి బాధితురాలు నుంచి రూ. 2.8 ల‌క్ష‌లు తీసుకున్నాడు. బాధితురాలు మ‌లేషియాలో ఐటీ జాబ్ చేస్తుంది. ఈమెతో పాటు మ‌రి కొంతమంది ఇత‌ర రాష్ట్రాల అమ్మాయిల‌ని కూడా డాక్ట‌ర్ సాయినాథ్ పేరుతో మోసం చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యింది. వచ్చిన డబ్బులతో నిందితుడు ఖరీదైన బైక్​లు కొని జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు.

పెళ్లి పేరుతో మోసం…. కిలాడీ అరెస్ట్!

ఇదీ చూడండి: ప్రియుడితో పెళ్లి జరగదనే భయంతో బాలిక ఆత్మహత్య

Intro:హైదరాబాద్ : మాట్రిమోనీ అమ్మాయిలను బుట్టలో వేసుకునే బానొత్ సాయి అనే మోసగాడి నీ అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు, మాట్రిమోనీ సైట్ ని వాడుకుని ఒక యువతి ని మోసం చేసిన ఫిజియో తెరపి విద్యార్థి ఖమ్మం కి చెందిన బాణోత్ సాయినాథ్ ని అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. మాట్రిమోనీ లో ఉంచిన అమ్మాయి ప్రొఫైల్ నుండి బాధితురాలి ఫోటోలు మరియు ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సప్ ద్వారా మారుపేరుతో డాక్టర్ అవినాష్ రెడ్డి అని చెప్పి మోసం చేసిన నిందితుడు సాయినాథ్. బాధితురాలు నుండి 2.8 లక్షలు తీసుకున్న నిందితుడు. బాధితురాలు మలేషియా లో ఐటీ జాబ్ చేస్తుంది. నిందితుడు చాలా సార్లు డబ్బుల కోసం వేధించటం చేసే వాడు. తనను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న యువతి ఎల్బీనగర్ లో సైబర్ క్రైమ్ పోలీస్ లకు పిర్యాదు చేసింది. రంగంలో కి దిగిన పోలీస్ లు ఆచూకీ కోసం ట్రాప్ చేయటం జరిగింది, ట్రాప్ చేస్తున్న విషయం తెలుసుకున్న నిందితుడు వరంగల్, గుంటూరు జిల్లాలో తిరుగుతూ పోలీస్ లకు పట్టుబడటం జరిగిందని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకునే తప్పుడు ముందు వెనుక చూసుకోవాలని సైబర్ క్రైమ్ ఏసిపి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మరికొంతమంది ఇతర రాష్ట్రాల అమ్మాయిలని కూడా డాక్టర్ సాయినాథ్ పేరుతో మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని, వచ్చిన డబ్బులతో ఖరీదైన బైక్ లు కొని జెల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు.

బైట్ : హరినాథ్ (రాచకొండ సైబర్ క్రైమ్ ఏసిపి)Body:TG_Hyd_61_21_Cyber Crime Pressmeet_AB_TS10012Conclusion:TG_Hyd_61_21_Cyber Crime Pressmeet_AB_TS10012
Last Updated :Nov 21, 2019, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.