ETV Bharat / state

Mallu Ravi: 'రేవంత్​ రెడ్డిని చూస్తే కేసీఆర్​, కేటీఆర్​ల​కు వణుకు'

author img

By

Published : Oct 23, 2021, 2:31 PM IST

రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీ అంటే సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ల వెన్నులో వణుకు పడుతుందని టీపీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెరాసకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గాంధీ భవన్​లో గాడ్సే దూరాడంటూ కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి ఘాటుగా స్పందించారు.

mallu ravi
మల్లు రవి

గాంధీ భవన్​లో గాడ్సే దూరిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ​ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. గాడ్సేల్లాగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నది కేసీఆర్, కేటీఆర్​ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ కాళ్లు మొక్కారు

భాజపాతో సీఎం కేసీఆర్​(Mallu Ravi) కుమ్మక్కయ్యారు కాబట్టే.. రెండు సార్లు దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కాళ్లు మొక్కారు. నోట్ల రద్దు నుంచి ఆర్టికల్​ 370 రద్దు వరకు కేంద్రానికి తెరాస మద్దతిచ్చింది. రైతులకు ఉరి తాళ్లుగా మారిన నల్ల చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయమంటే పారిపోయి భాజపాకు మద్దతిచ్చింది ఎవరు.? - మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు

ఏం చేశారో చెప్పండి

రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చూస్తే కేసీఆర్​, కేటీఆర్​ల​ వెన్నులో వణుకు పుడుతుందని మల్లు రవి(Mallu Ravi) ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏడేళ్ల పాలనలో తెరాస.. ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓట్లడగాలి కానీ.. కాంగ్రెస్ మీద పడి ఏడవడం ఎందుకని మండిపడ్డారు. తాజాగా దళిత బంధు ఇస్తామని చెప్పి ఆపేశారని.. దళితులకు భూములు, ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి పెండింగ్​లో పెట్టారని(Mallu Ravi) ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్​ను నిందించడం కేటీఆర్​కు ఫ్యాషన్ అయిందని అన్నారు. రాబోయే రోజుల్లో తెరాసకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

ఇదీ చదవండి: KTR Speech: ఈటల, రేవంత్‌ భేటీ వెనుక మతలబేంటి?: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.