ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు నేడు తుదిగడువు

author img

By

Published : Feb 13, 2021, 8:01 AM IST

Updated : Feb 13, 2021, 9:05 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు ఈరోజే చివరిరోజు. తెలంగాణలో మార్చి 14న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

'ఈరోజే చివరిరోజు... ఓటుహక్కు నమోదు చేసుకోండి'
'ఈరోజే చివరిరోజు... ఓటుహక్కు నమోదు చేసుకోండి'

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు నేటితో గడువు ముగియనుంది. మార్చి 14న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఫిబ్రవరి 23 గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 22వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.

Last Updated : Feb 13, 2021, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.