ETV Bharat / state

బీఆర్​ఎస్​ హయాంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం - కావాలని బద్నాం చేస్తున్నారు : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 9:23 PM IST

Updated : Dec 25, 2023, 11:50 AM IST

KTR Presentation on BRS Nine and Half Years Rule : కేసీఆర్ సర్కార్ హయాంలో రూ.50 లక్షల కోట్ల సంపదతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా బీఆర్​ఎస్​ ప్రభుత్వం సృష్టించిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్​గా స్వేదపత్రం విడుదల చేశారు. వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అన్నీ పెట్టామని, ప్రభుత్వం ప్రకటించినట్లు ఎలాంటి విచారణలైనా చేయించుకోవచ్చని స్పష్టతనిచ్చారు. దేశానికే టార్చ్ బేరర్ అయిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వబోమని వ్యాఖ్యానించారు.

KTR Released Sweda patram on BRS Development
BRS Presentation on KCR Development

ప్రభుత్వ ప్రతి అడుగును నిశితంగా గమనిస్తాం కేటీఆర్

KTR Presentation on BRS Nine and Half Years Rule : ఆర్థిక, ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్​గా భారత రాష్ట్ర సమితి స్వేదపత్రాన్ని విడుదల(KTR Released Sewda patram) చేసింది. తెలంగాణ భవన్​లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పాలనను బద్నాం చేసే ప్రయత్నం చేసిందని అన్నారు. ప్రభుత్వం ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పామని పేర్కొన్నారు. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే స్వేదపత్రం విడుదల చేశామని మాజీ మంత్రి కేటీఆర్​ చెప్పారు.

తెలంగాణకు అస్థిత్వమే కాదు - ఆస్తులు కూడా సృష్టించాం : కేటీఆర్‌

"ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట అభాండాలు వేస్తున్నారు. పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద రాష్ట్రంలో పదుల రెట్లు అయింది. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సమష్టి సంపద. ఎక్కువ వేతనాలు, ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేక పోయాము. ఆరు గ్యారెంటీలే కాదు కాంగ్రెస్‌ 412 హామీలు ఇచ్చింది. వంద రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."- కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR Fire on Congress White Paper : పౌర సరఫరాల సంస్థ నిల్వలను పక్కన పెట్టి, లేని అప్పును ఉన్నట్లుగా చూపి సర్కార్‌ తిమ్మిని బమ్మిని చేస్తుందని కేటీఆర్​(KTR Fire on Congress Government) మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో అంధకారమైన రాష్ట్రాన్ని బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక వెలుగులోకి తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్‌ను భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని వివరించారు.

రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్

"సుపరిపాలన అందిస్తారా కక్ష సాధిస్తారా అన్నది వారి ఇష్టం. నిరుద్యోగ భృతిపై నాలుక మడత వేశారు. ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయి. మేము షాడో టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటాం. ప్రభుత్వ ప్రతి అడుగును నిశితంగా గమనిస్తాం. ఓటమి మాకు కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. టార్చ్ బేరర్ తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం. యువత, ఉద్యోగ విషయాల్లో తప్పులున్నాయి, సరిచేసుకుంటాం."- కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

BRS Presentation on KCR Development : భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం తెలంగాణేనని కేటీఆర్‌ తెలిపారు. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టే పనికిరాదన్నట్లు మాట్లాతున్నారని ధ్వజమెత్తారు. తప్పు జరిగితే విచారణ జరిపి చర్య తీసుకోవాలి కానీ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నేరవేర్చేలా ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వర్తిస్తామని కేటీఆర్​ చెప్పారు.

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్‌

KCR Government 2014-23 Development Presentation : ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని అన్నారు. ఓటమి మాకు స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమష్టి సంపదను అస్థిత్వాన్ని కాపాడే ప్రయత్నమే గత పాలనలో జరిగిందని కేటీఆర్ అన్నారు. దేశానికి తెలంగాణను ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలపడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్‌

Last Updated :Dec 25, 2023, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.