ETV Bharat / state

Kishan Reddy fires on KCR : 'నిజాంలా ఇల్లు నిర్మించుకున్నారు.. పార్టీలకు స్థలాలు కేటాయించారు.. మరి పేదవారికి ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు'

author img

By

Published : Jul 31, 2023, 4:00 PM IST

BJP rally on Double Bed Room Houses in Mahabubnagar : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, మజ్లిస్ కుటుంబ పార్టీలని.. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చే పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. వాటిలో ఏ పార్టీకి ఓటేసినా మిగిలిన పార్టీలకు మద్దతిచ్చినట్లేనని విమర్శించారు. మూడు పార్టీలు గతంలో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసిన కిషన్‌రెడ్డి.. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. పేదలకు రెండు పడకల గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy Participated in Rally Over Double Bed Room Houses : అర్హులైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం నుంచి గడియారం కూడలి వరకు జరిగిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గడియారం కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తే.. తెలంగాణలో రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్రం వాటా ఇస్తామని చెప్పినా.. సీఎం కేసీఆర్‌ అమలు చేయలేదని ఆరోపించారు. కోట్ల రూపాయలతో నిజాంలా ఇల్లు నిర్మించుకున్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాల స్థలం, బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు, ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు నిర్మించారే తప్ప పేదలకు మాత్రం ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప.. పేదవాళ్లకు కొత్తగా రేషన్ కార్డులు ఇంత వరకు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు.

Kishan Reddy criticism of BRS : 2018 నుంచి కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచారని.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి 9 ఏళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి హామీ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని విమర్శించారు. రుణమాఫీ అమలు కాక రైతులు మొండి బకాయిదారులుగా మారి బ్యాంకుల్లో కొత్త అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందన్నారు. బంగారు తెలంగాణ సంగతి పక్కన పెట్టి, దోపిడీలతో కేసీఆర్‌ కుటుంబం బంగారు కుటుంబమైందన్నారు. కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, భూములు, ఇసుక, గ్రానైట్, మద్యం పేరిట బీఆర్‌ఎస్‌ దోపిడీ కొనసాగుతోందని, మిగులు బడ్జెట్ ఉండే తెలంగాణను లిక్కర్, అప్పుల తెలంగాణగా మార్చివేశారని ఆరోపించారు. బీసీ బంధు పేరిట మోసం తప్ప.. బీసీలకు న్యాయం చేయలేకపోయారని అభిప్రాయపడ్డారు.

"రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అయినా ఉద్యోగాల భర్తీ జరగలేదు. యూనివర్సిటీల్లో అనేక ఖాళీలు ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులకు రుణాల మాఫీ జరగలేదు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం బంగారు కుటుంబం కాలేదు. కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయ్యింది. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

DK Aruna fires on KCR : పాలమూరు అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదలందరికీ ఇళ్లు ఇస్తామని డీకే అరుణ హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.