ETV Bharat / state

TSPSC Group 1 Results 2023 : ఫలితాలను వెల్లడించేలా టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. ప్రత్యేక ప్రణాళిక షురూ

author img

By

Published : Jul 31, 2023, 7:13 AM IST

Updated : Jul 31, 2023, 9:13 AM IST

TSPSC Group 1 Results 2023
TSPSC Group 1 Results 2023

TSPSC Group 1 Prelims Results 2023 : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు న్యాయవివాద అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల తుది కీ వెల్లడించి, 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలు ప్రకటించనుంది. అభ్యర్థుల సంఖ్య మేరకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తూ, వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్‌, తుది కీని సోమ లేదా మంగళవారాల్లో ప్రకటించాలని భావిస్తోంది.

ఫలితాలను వెల్లడించేలా టీఎస్‌పీఎస్‌సీ కసరత్తు

TSPSC Group 1 Results : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న టీఎస్​పీఎస్సీ ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు ప్రారంభించింది. న్యాయవివాద అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల తుది కీ వెల్లడించి.. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలు ప్రకటించనుంది. అభ్యర్థుల సంఖ్య మేరకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తూ, వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

TSPSC Group 1 Prelims Result 2023 : టీఎస్​పీఎస్సీ ప్రస్తుతం 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రోజూ 16 గంటలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇటీవల గ్రూప్‌-1 పరీక్షను కమిషన్‌లోని 10 మంది ఉద్యోగులు రాశారు. వీరంతా నిబంధనల మేరకు నిర్బంధ సెలవులు పూర్తి చేసుకుని తాజాగా విధులకు వచ్చారు. వీరికి గ్రూప్స్‌కు సంబంధించినవి కాకుండా ఇతర పనులు అప్పగించారు. అందుబాటులోని ఉద్యోగులతోనే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మెరిట్‌ జాబితాల వెల్లడితో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఉద్యానాధికారులు, లైబ్రేరియన్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి. ఇందులో కొన్ని పోస్టులకు తుది కీ ఇప్పటికే వెల్లడైంది. ఏఈఈ పోస్టులకు వచ్చే సోమవారం తుది కీ వెల్లడించాలని కమిషన్‌ వర్గాలు భావిస్తున్నాయి. గ్రూప్‌-1 పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్‌.. తుది కీని సోమ లేదా మంగళవారాల్లో ప్రకటించాలని భావిస్తోంది.

ఫలితాలను వెల్లడించడానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి : గ్రూప్‌-1 ప్రిలిమినరీ తుది కీ ఇచ్చిన 15 రోజుల్లో ఫలితాలు ప్రకటించాలని కమిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కొన్ని న్యాయ వివాదాలు అడ్డంకిగా మారాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో రిజర్వేషన్లను జీవో నెం. 55 ప్రకారం అమలు చేయడంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ స్థానికతపై న్యాయవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వ్యవసాయ అధికారుల పోస్టుల ఫలితాలను వెల్లడించడానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులపై న్యాయవివాదం పెండింగ్‌లో ఉంది. గ్రూప్‌-4కు సంబంధించిన ఓఎమ్​ఆర్ పత్రాల ఇమేజింగ్‌ దాదాపు పూర్తయింది. ఈ పరీక్ష ప్రిలిమినరీ కీ వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

TSPSC Group 3 Exam : గ్రూప్‌-3 పరీక్షను అక్టోబరులో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అక్టోబరులో దసరా సెలవుల కన్నా ముందుగానే పరీక్ష నిర్వహించేందుకు కృషి చేస్తోంది. దసరా తర్వాత రాష్ట్రంలో పోలీసులు, ఇతర సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతారని, ఆ సమయంలో పరీక్షల నిర్వహణ కష్టంగా ఉంటుందని కమిషన్‌ భావిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Jul 31, 2023, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.