ETV Bharat / state

ప్రజలను రెచ్చగొట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలు: కిషన్​రెడ్డి

author img

By

Published : Jan 7, 2023, 10:53 PM IST

Kishan Reddy participated in the bankers meeting: మంత్రి కేటీఆర్​పై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలను రెచ్చ గొట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం.. సాయం చేసిందని స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి

Kishan Reddy participated in the bankers meeting: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రజలను రెచ్చ గొట్టేలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా సాయం చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు రుణాలు పొందలేకపోతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ బ్యాంకర్స్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయం ఇస్తుందని పేర్కొన్న కేంద్రమంత్రి.... కేంద్రం గ్రామపంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్రం కరెంటు బిల్లులకు కడుతుందని మండిపడ్డారు.

సిద్దిపేట అభివృద్ది నిధులు సిద్దిపేట నుంచే వస్తున్నాయా అని ప్రశ్నించారు. కరోనా తర్వాత బ్యాంకు పనితీరు మెరుగుపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకులు డిపాజిట్ల కంటే ఎక్కువగా రుణాలు ఇస్తున్నాయన్నారు. ప్రతి బ్యాంకు ఒక ఎస్సీ,ఎస్టీ, మహిళలకు రుణాలిచ్చి స్టాండప్‌ కింద రుణాలు అందజేసి వ్యాపారులుగా మారుస్తారని వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.