ETV Bharat / crime

జేఎన్‌టీయూ బస్టాండ్‌ వద్ద బస్సు దగ్ధం

author img

By

Published : Jan 7, 2023, 9:53 PM IST

Updated : Jan 7, 2023, 10:34 PM IST

జేఎన్‌టీయూ బస్టాండ్‌ వద్ద బస్సు దగ్ధం
జేఎన్‌టీయూ బస్టాండ్‌ వద్ద బస్సు దగ్ధం

21:47 January 07

జేఎన్‌టీయూ బస్టాండ్‌ వద్ద బస్సు దగ్ధం

కూకట్‌పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కావేరి ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు, పోలీసులు అప్రమత్తమై బస్సులోని వారిని కిందకు దించారు. ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనతో జేఎన్టీయూ మెట్రో స్టేషన్‌ వద్ద కాసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్తున్నట్టు సమాచారం.

ఇవీ చూడండి..

కూకట్‌పల్లిలో కూలిన భవనం స్లాబ్‌... ఒకరు మృతి

హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నైజీరియన్ అరెస్ట్

Last Updated :Jan 7, 2023, 10:34 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.