ETV Bharat / state

వారి అండతోనే మాపై దాడులు.. ప్రజలే సమాధానం చెప్తారు: కిషన్​రెడ్డి

author img

By

Published : Nov 18, 2022, 7:21 PM IST

Kishan Reddy Fires On TRS Activists Attack
Kishan Reddy Fires On TRS Activists Attack

Kishan Reddy Fires On TRS Activists Attack: ప్రధాని మోదీ అభివృద్ధి చూసి పార్టీలోకి వచ్చే వాళ్లనే చేర్చుకుంటామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నేర్పరితనంలో కేసీఆర్‌ను మించిన వారు లేరని వ్యంగాస్త్రాలు సంధించారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టాలంటే మొదట కేసీఆర్‌ మీదే పెట్టాలని కిషన్​రెడ్డి వెల్లడించారు.

Kishan Reddy Fires On TRS Activists Attack: హైదరాబాద్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై టీఆర్ఎస్​ కార్యకర్తల దాడిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఖండించారు. అర్వింద్‌ నివాసానికి వెళ్లిన ఆయన ఉదయం జరిగిన దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోవాలనే కోరిక తమకు లేదని కిషన్​రెడ్డి అన్నారు. భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం తమకు లేదని పేర్కొన్నారు. తాయిలాలు ఇచ్చి బీజేపీలో చేర్చుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ అభివృద్ధి చూసి పార్టీలోకి వచ్చే వాళ్లనే చేర్చుకుంటామని కిషన్​రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నేర్పరితనంలో కేసీఆర్‌ను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టాలంటే మొదట కేసీఆర్‌ మీదే పెట్టాలని అన్నారు. కేసీఆర్‌ ఇప్పటికే ఎన్ని పార్టీల గొంతులు నొక్కారో అందరికీ తెలుసునని ఆరోపించారు. దేశంలో ఇతర పార్టీల మెప్పు కోసమే కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ క్రమంలోనే మోదీని ఢీకొంటున్నట్లు ఇతరులు అనుకోవాలని.. ఈ చర్యలకు పాల్పడుతున్నారని కిషన్​రెడ్డి విమర్శించారు. ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారని గుర్తు చేశారు. పోలీసులు, మజ్లిస్‌ను అడ్డుపెట్టుకుని తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తలు ఉదయం దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్‌ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి: తెరాస దాడిని ఖండించిన భాజపా నేతలు.. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడి

సోషల్​ మీడియాలో ప్రధాన పార్టీల ప్రచార హోరు.. రసవత్తరంగా గుజరాత్​ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.