ETV Bharat / state

రసవత్తరంగా కేసీఆర్ వాలీబాల్ టోర్నీ..

author img

By

Published : Jan 25, 2021, 11:04 AM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కేసీఆర్​ వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు.

Breaking News

కరీంనగర్​లో రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన కేసీఆర్​ వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది.

టోర్నమెంట్​ ఫైనల్లో..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52 ఆహ్వానిత జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. రెండు రోజుల పాటు రసవత్తరంగా జరిగిన ఈ టోర్నమెంట్​ ఫైనల్లో .. గంగాధర జట్టును కరీంనగర్ జట్టు ఓడించి విజేతగా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. విజేత కరీంనగర్ జట్టుకు కేసీఆర్​ కప్​తో పాటు.. రూ.15 వేల నగదును బహుమతిగా అందజేశారు.

ఇదీ చదవండి:15 గంటలకు పైగా సాగిన భారత్​- చైనా చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.