ETV Bharat / state

AP Employees Protest: ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం... నేడు కలెక్టరేట్​ల ముట్టడి

author img

By

Published : Jan 20, 2022, 10:16 AM IST

AP Employees Protest on PRC: పీఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్​లో ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు... నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో పిలుపునిచ్చింది.

AP Employees Protest on PRC
ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం

AP Employees Protest on PRC: ఆంధ్రప్రదేశ్​లో పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. రేపు సీఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. నేడు భేటీకానున్న ఉద్యోగసంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.

ఇప్పటికే నిరసనలు హోరెత్తిస్తున్న ఉపాధ్యాయులు ఫ్యాఫ్టో పిలుపు మేరకు నేడు కలెక్టరేట్లు ముట్టడించనుండగా జాక్టో డివిజన్‌ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. సచివాలయ ఉగ్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన చేయనున్నారు.

ఇదీ చదవండి: cm kcr on employees: పరస్పర బదిలీలకు సీఎం అంగీకారం.. నేడు ఉత్తర్వుల జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.