ETV Bharat / state

Hyderabad Rains : బిగ్​ అలర్ట్​.. జంటనగరాల్లో భారీ వర్షం.. రాత్రంతా ఇదే పరిస్థితి.. జర జాగ్రత్త..!

author img

By

Published : Jul 26, 2023, 10:48 PM IST

Updated : Jul 26, 2023, 10:56 PM IST

Hyderabad Rains
Hyderabad Rains

Today Rain Update In Hyderabad : భాగ్యనగరంపై వరుణుడు కనీసం కనికరం చూపడం లేదు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు తీవ్ర ఇబ్బందులు జంటనగరవాసులపై మళ్లీ వరుణుడు విరుచుకుపడుతున్నాడు. తాజాగా నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఇవాళ రాత్రంతా ఇదే విధంగా వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో వర్షం మళ్లీ మొదలైంది. తాజాగా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరంలోని అత్తాపూర్, బోరబండ, మోతీ నగర్, సనత్ నగర్, అమీర్​పేట్, ఎస్సార్​ నగర్, మైత్రివనం, రహమత్​నగర్, యూసఫ్ గూడా, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కూకట్​పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్​బీ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంపాపేట్​, సైదాబాద్, సరూర్​నగర్, కొత్తపేటలో పడ్డ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లపై వర్షం నీరు వాగుల వలే ప్రవహిస్తోంది. మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ బోరంపేట్, తార్నాక, లాలాపెట్, ఓయూ క్యంపస్, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజీలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన పర్యాటకులు వర్షానికి తడిసిముద్దయ్యారు. వర్షంలోనే తడుస్తూ వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

హైదరాబాద్‌లో ఈ రాత్రంతా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది.

DGP Anjani Kumar Review on rains : రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. రానున్న 48 గంటలలో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్​పీలతో శాంతి భద్రతల అదనపు డీజీ సంజయ్ కుమార్ జయంతో కలిసి డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎవరైనా సహాయం కోసం డయల్ 100 కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాబోయే 24 గంటల్లో దాదాపు 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని పోలీసులు అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 26, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.