సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో.. మరో రైల్​​లోకి ప్రయాణికుల తరలింపు

author img

By

Published : Jan 23, 2023, 9:45 AM IST

Updated : Jan 23, 2023, 10:26 AM IST

Hyderabad Metro

సాంకేతిక కారణాలతో ఎర్రమంజిల్​లో మెట్రో రైలు సర్వీసుకు అంతరాయం కలిగింది. అందులోని ప్రయాణికులను.. సిబ్బంది మరో రైలులోకి తరలిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్​లో ట్రాఫిక్ కష్టాలతో చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ​తో నగరవాసులు మెట్రో ప్రయాణానికే ఆసక్తి చూపుతున్నారు. కానీ కొన్ని సార్లు సాంకేతిక కారణాలతో మెట్రో సేవలకు అంతరాయం కలుగుతుంది. తద్వారా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజాగా సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్​లో మెట్రో రైలు నిలిచిపోయింది. అందులోని ప్రయాణికులను.. సిబ్బంది మరో రైలులోకి తరలించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా.. సాంకేతిక సమస్య తలెత్తినట్టు అధికారులు గుర్తించారు. ఆఫీసులకు, వివిధ పనులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మరోవైపు శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు మెట్రో సేవలు అందించేందుకు ప్రభుత్వం పనులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు.. స్టేషన్‌ను పొడిగించి అక్కడ ఎయిర్‌పోర్టు మెట్రోస్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 31 కారిడార్​లు నిర్మిస్తున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో వెళ్తూ 31 కి.మీ. దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చదవండి: Telangana Tourism : పర్యాటక ప్రదేశాల్లో టాయ్‌ ట్రైన్‌లు

పాదచారులు, కారుపైకి దూసుకెళ్లిన డంపర్​.. ఆరుగురు మృతి

Last Updated :Jan 23, 2023, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.