ETV Bharat / state

భారీ కొండచిలువను చూసి.. ఆ ఇద్దరు కుర్రాళ్లు ఏం చేశారంటే!?

author img

By

Published : May 30, 2022, 8:40 PM IST

huge python at purushothapuram in srikakulam
భారీ కొండచిలువను చూసి.. ఆ ఇద్దరు కుర్రాళ్లు ఏం చేశారంటే!?

PYTHON: సాధారణంగా చిన్న పామును చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం. మరి అలాంటిది భారీ కొండచిలువను చూస్తే ఇంకేమైనా ఉందా? బెంబేలెత్తిపోయిన జనం.. ఏదో విధంగా దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. కానీ.. ఇద్దరు యువకులు మాత్రం చంపొద్దని చెప్పి.. ఆ కొండచిలువను పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు..!

PYTHON: ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఇసుక ర్యాంపు వద్ద భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసి అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత ఏదో విధంగా ఆ కొండచిలువను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇద్దరు స్థానిక యువకులు వారించారు. వారిద్దరూ ఆ కొండచిలువను పట్టుకుని గోనె సంచిలో బంధించారు. ఆ తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టారు. వారు చేసిన పనిని గ్రామస్థులు అభినందించారు. మరి, వారి సాహసాన్ని మీరూ చూసేయండి.

భారీ కొండచిలువను చూసి.. ఆ ఇద్దరు కుర్రాళ్లు ఏం చేశారంటే!?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.