ETV Bharat / state

'వివాహభోజనంబును ఆదరిస్తున్న అందరికీ వందనం'

author img

By

Published : Dec 23, 2019, 10:37 AM IST

వివాహ భోజనంబు హోటల్​ మూడో బ్రాంచ్​ని హైదరాబాద్​ నేరెడ్​మెట్​లో హీరో సందీప్​కిషన్​, ఎంపీ జోగినపల్లి సంతోష్​తో కలిసి ప్రారంభించారు. ఆహార ప్రియుల కోసం రానున్న రోజుల్లో మరిన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు హీరో సందీప్​ తెలిపారు.

hotel-launch-in-hyderabad
'వివాహభోజనంబును ఆదరిస్తున్న అందరికీ వందనం'

హైదరాబాద్​ నేరెడ్​మెట్ వాయుపురిలో హీరో సందీప్ కిషన్ సందడి చేశారు. వివాహ భోజనంబు హోటల్​ 3వ ఔట్లెట్​ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ జోగినపల్లి సంతోష్, హీరో సందీప్ కిషన్​లు హాజరయ్యారు.

వివాహ భోజనంబు ఆహారాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హీరో సందీప్​ కిషన్​ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్​ నెలలో నూతన బ్రాంచ్​లను ప్రారంభిస్తామని, రానున్న రోజుల్లో ఆహార ప్రియులకోసం మరిన్ని బ్రాంచ్​లు ఏర్పాటు చేయనున్నట్టు సందీప్​ కిషన్​ పేర్కొన్నారు.

'వివాహభోజనంబును ఆదరిస్తున్న అందరికీ వందనం'

ఇదీ చూడండి: మానవత్వం చాటిన మంత్రి ప్రశాంత్​రెడ్డి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.