ETV Bharat / state

అభివృద్ధి పనులు పరిశీలించిన హెచ్​ఎండీఏ కమిషనర్​

author img

By

Published : Apr 23, 2020, 4:50 AM IST

నార్సింగిలో జరుగుతున్న అభివృద్ధి పనులను హెచ్ఎండీఏ కమిషనర్​ అర్వింద్​ కుమార్​ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

హెచ్ఎండీఏ కమిషనర్​ అర్వింద్​ కుమార్​
హెచ్ఎండీఏ కమిషనర్​ అర్వింద్​ కుమార్​

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మునిసిపల్ ​శాఖ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ పరిశీలించారు. ఓఆర్​ఆర్​ 153 కిలోమీటర్​ వద్ద దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో హరిత సుందరీకరణ ​పనులు చేపట్టారు. పనులు వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ అర్బన్​ ఫారెస్ట్రీ అధికారులను ఆయన ఆదేశించారు.

ఐకియా సర్కిల్​ వద్ద హెచ్​ఎండీఏ చేస్తున్ శంషాబాద్ ఇంటర్​ఛేంజ్ ​బ్యూటిఫికేషన్ ​​పనులను సైతం ఆయన పర్యవేక్షించారు. అంతకు ముందు నార్సింగి వద్ద గల అక్షయపాత్ర ఫౌండేషన్​ను సందర్శించారు. ఫౌండేషన్​ ప్రతినిధులతో కలిసి మెగా కిచెన్​ను ఆయన పరిశీలించారు.

ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.