ETV Bharat / state

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..!

author img

By

Published : Oct 18, 2020, 6:21 AM IST

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..!
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..!

ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్​ వాతావారణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే నగరవ్యాప్తంగా మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు.

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం రంగారెడ్డి, జీహెచ్​ఎంసీ పరిధిలో కురుస్తోన్న వర్షాలు.. చివరి రెండు రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయని పేర్కొంది.

ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్​ నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. ఇది ఈ నెల 20 నాటికి తీవ్రమవుతుందని వెల్లడించారు.

శనివారం రాత్రి పదిగంటల వరకు జంటనగరాల్లోని ప్రాంతాలైన ఘట్ కేసర్​లో అత్యధికంగా 19.7 సెం.మీ, సరూర్ నగర్​లో 17, మేడిపల్లిలో 16.9, ఎల్బీనగర్ 16.7, ఉప్పల్, బండ్లగూడ, మోయినాబాద్, సైదాబాద్, అబ్దుల్లాపూర్ మెట్​లో 15 సెం.మీల పైచిలుకు వర్షపాతం నమోదయింది.

ఇదీ చదవండి: అప్రమత్తంగా ఉండండి: డీజీపీ మహేందర్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.