రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ అంటే చెడుపై మంచి విజయం అనే సందేశాన్ని ఇస్తుందని తమిళిసై తెలిపారు. నిజం మాత్రమే విజయం సాధిస్తుందని మనం విశ్వసిస్తామన్నారు. పండుగను జరుపుకునేటప్పుడు పర్యావరణ ప్రమాదాలతో సహా అన్ని చెడులతో పోరాడటానికి సమిష్టిగా ప్రయత్నించాలని గవర్నర్ ఉద్బోధించారు. దసరా వేడుకలను సంతోషకరంగా జరుపుకునేలా ఆశీర్వదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తమిళి సై తెలిపారు.
ఇవీ చూడండి:యాచకుడి వద్ద లక్షలు- సంపద చూసి పోలీసులు షాక్