ETV Bharat / state

గోవులను కబేళాలకు తరలిస్తుండగా పట్టుకున్న రాజాసింగ్

author img

By

Published : Dec 22, 2020, 11:52 AM IST

goshamahal-mla-raja-singh-saved-cows-transport-of-slaughterhouse-in-shamshabad
ఆవులను పట్టకున్న ఎమ్మెల్యే రాజాసింగ్

ఆవులను అక్రమంగా తరలిస్తోన్న ఓ వాహనాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ అడ్డగించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు 45 గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కబేళాలకు ఆవులను తరలిస్తోన్న ఓ వాహనాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు 45 గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించారు. పట్టుబడిన ఆవులను గోశాలకు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆవులను కబేళాలకు తరలిస్తున్న వారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గోరక్షణ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా గోవులను తరలిస్తుంటే పోలీసు శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ఏర్పాటులో కాకాది కీలక పాత్ర: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.