ETV Bharat / state

రాజ్​భవన్​లోని వినాయకుని నిమజ్జనం

author img

By

Published : Aug 24, 2020, 9:53 PM IST

Ganesha idol immersion held at Raj Bhavan at Hyderabad
రాజ్​భవన్​లోని వినాయకుని నిమజ్జనం

రాజ్​భవన్​లో ప్రతిష్టించిన గణనాథున్ని ప్రత్యేక వూజల అనంతరం నిమజ్జనం చేశారు. మూడో రోజు కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వినాయకుడి నిమజ్ఞనాలు చేశారు.

రాజ్​భవన్​లో ప్రతిష్టించిన విఘ్నేశ్వరున్ని నిమజ్జనం చేశారు. అంతకుముందు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన భర్తతో కలిసి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు... రాజ్​భవన్ ప్రాంగణంలో ఉన్న చేపల కొలనులో గణపతిని నిమజ్జనం చేశారు.

మూడో రోజు కావడం వల్ల జంట నగరాల్లో భక్తిశ్రద్ధలతో భక్తులు వినాయకుని నిమజ్ఞనాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. నిమజ్జనం కార్యక్రమం చేసుకోవాలని భక్తులను కోరారు.

ఇదీ చూడండి: నెమ్మదించిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్​కు తగ్గిన వరద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.